TDP Mahanadu: పదుల సంఖ్యలో సొమ్మసిల్లి పడిపోతున్న టీడీపీ కార్యకర్తలు

by Disha Web Desk 16 |
TDP Mahanadu: పదుల సంఖ్యలో సొమ్మసిల్లి పడిపోతున్న టీడీపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో టీడీపీ మహానాడులపై ఎండల ఎఫెక్ట్ పడింది. మహానాడు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే పలువురిపై ఎండ తీవ్రత పడింది. దీంతో పదుల సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు అస్వస్థతకు గురవుతున్నాయి. ఎండ తీవ్ర తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. వీరికి మెడికల్ క్యాంపులో చికిత్స అందిస్తున్నారు. నీరసించి వారికి సెలైన్లు ఎక్కిస్తున్నారు. మరింత చికిత్స అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం అయ్యే సరికే సూర్యుడు మల మల మాడిపోతున్నారు. దీంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకిపోతున్నారు. ఓ వైపు ఎండ... మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

Also Read..

Mahanadu: రంగులు బాగా వేస్తారు... సీఎం జగన్‌పై లోకేశ్ సెటైర్స్

Mahanadu2023: పెద్దిరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకూ నారా లోకేశ్ మాస్ వార్నింగ్



Next Story

Most Viewed